- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం (AI173) సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సుమారు 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బోయింగ్ 777-300 ER రకానికి చెందిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
- Advertisement -



