ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – మిరుదొడ్డి 
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మిరుదొడ్డి అక్బర్ పేట భూంపల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిరుదొడ్డి ,అక్బర్ పేట భూంపల్లి  మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ , మధ్యల రాజేశం , మండల అధ్యక్షులు అక్కపల్లి బాల్ నర్సాగౌడ్ మరియు భూంపల్లి భీమ్రావు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కుతుందని అందుకే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారిని తెలంగాణ దేవతగా కొలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు దశాబ్ది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం అమరులైన అమరుల త్యాగాలు మరువలేనిది అని ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి బాల గౌడ్, తాజా మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, గుండా శంకర్, టెలికం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్, రవీందర్ రెడ్డి, బాల్తే వెంకటేశం, మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, కిసాల్ సెల్ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి, ఫిషర్ మెన్ మండల అధ్యక్షుడు అన్నబోయిన చంద్రశేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కమటం మల్లేశం, సేవాదళ్ మండల అధ్యక్షుడు పాతూరి భూపాల్ రెడ్డి వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love