ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – మిరుదొడ్డి 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండలాల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. తెలంగాణ కోసం అమరులైన వారికి నినాదాలు అర్పించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ సాయిలు, తహసిల్ కార్యాలయం ఎదుట తహసిల్దార్ గోవర్ధన్, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో ఎస్సై పరశురాములు, ఆబ్కారి  సిఐ కార్యాలయం ఎదుట సీఐ గాయత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట వైద్యాధికారి సమీరా సుల్తానా, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఏఈఓ నిర్మల, పిఎసిఎస్ కార్యాలయం ఎదుట చైర్మన్ రాజలింగారెడ్డి, ఐకెపి కార్యాలయం ఎదుట డిపిఎం బాలకిషన్, మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల ఎదుట ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. కొండాపూర్ లో అమరవీరుల స్థూపం వద్ద గ్రామస్తులు పూలమాలతో నివాళులు అర్పించారు.
Spread the love