నందికొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ,కమిస్నర్ శ్రీను ఆధ్వర్యంలో స్థానిక విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో సి.ఐ బిసన్న,ఎస్.ఐ సంపత్ ఆధ్వర్యంలో,ఎన్ఎస్పీ కార్యాలయంలో ఎస్.ఈ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం  జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. అనంతరం పలువురు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ప్రత్యేక సలహా దారుడు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రావు,వైస్ చైర్మన్ ఆదాసు నాగ రాణి విక్రమ్,కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ,మంగత నాయక్,నిమ్మల ఇందిరా,రమేష్ జి,ఆలిండియా బంజారా సేవ సంఘం సాగర్ పట్టణ అధ్యక్షులు మోహన్ నాయక్,ఆదాసు విక్రమ్,చంద్రమౌళి,వల్లభ రెడ్డి,జానకి రెడ్డి మరియు వివిధ కార్యాలయ ఉద్యోగులు తదితరులున్నారు.

Spread the love