
తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అస్మతుల్లా హుస్సేన్ ని ఘనంగా సన్మానించిన భువనగిరి పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు స్థానిక బైపాస్ వివేరా హోటల్ వద్ద శుక్రవారం పట్టణ ముస్లిం మైనార్టీలు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ముస్లింల హక్కుల కోసం పోరాడాలని అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండి అవిసె చిస్తీ, ఎండి మాజార్, సయ్యద్ రషీద్,హుస్సేన్, ఎండి సలావుద్దీన్, ఎండి అత్తర్, ఎండి ఆబిద్ అలీ, ఎం డి ఏజాజ్, ఎండి ఇంతియాజ్, ఎండి లైక్ అహ్మద్, ఎండి సమీర్ ఎండి అజహర్, ఎండి జలీల్, ఎండి ఇస్తియాక్ పాల్గొన్నారు.