రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు..

నవతెలంగాణ-హైదరాబాద్: భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది మరవకముందే గుజరాత్‌లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ఓ టెర్మినల్‌ పైకప్పు శనివారం ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో ఈదురు గాలులకు ప్రయాణికుల పికప్‌, డ్రాప్‌ పాయింట్‌ వద్ద ఉన్న టెర్మినల్‌ పైఉన్న పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కాగా, గుజరాత్‌లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.

Spread the love