యాదవ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం

– కాంగ్రెస్ ప్రభత్వానికి యాదవుల తరుపున కృతజ్ఞతలు
– కార్పొరేషన్ ఏర్పాటు తో యాదవుల సమస్యలు పరిష్కారం
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యాదవ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్ 
నవతెలంగాణ – రామగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ,కురుమ సమస్యలు పరిష్కారం కోసం యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం అని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యాదవ కుల సంఘం నాయకులు తోట్ల తిరుపతి యాదవ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కోసం యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, గత పాలకులు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్ర భుత్వం ముందుకు వచ్చి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిందని పేర్కోన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో యాదవులకు ఏలాంటి న్యాయం జరుగ లేదన్నారు. అదేవిధంగా యాదవ కార్పోరేషన్ కోసం ఇటీవల యాదవ సంఘం నాయకులు కలిసిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కృషి చేసిన రాష్ట్ర ఐటీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నమని తెలిపారు. కార్పొరేషన్. ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కకి  యాదవ కులస్థుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.యాదవ కులస్థులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింతగా ప్రాధాన్యత కల్పించాలని నాయకులు తిరుపతి యాదవ్  కోరారు.
Spread the love