తెలంగాణలోనే మొట్టమొదటి రేణుక ఎల్లమ్మ అన్నదానం ట్రస్ట్

– ప్రారంభించిన హీరో సుమన్
నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణలోనే మొట్టమొదటిగా వేములవాడలో అఖిలభారత శ్రీ రాజరాజేశ్వరి రేణుక ఎల్లమ్మ గౌడ్ నిత్య అన్నదాన ట్రస్టును వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు హీరో సుమన్ ప్రారంభించారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ట్రస్టు నిర్వాహకులతో కలిసి నిత్య అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే వేములవాడ పుణ్యక్షేత్రంలో గౌడు కులస్తుల కోసం సత్రాన్నిప్రారంభించడం జరిగిందని అన్నారు. గౌడ కులస్తులకు నిత్య అన్నదాన సేవలను అందిస్తోంది అని తెలిపారు. రాష్ట్రంలోని సుధీర ప్రాంతాల నుండి వచ్చే రాజన్న భక్తుల కోసం శ్రీ రాజరాజేశ్వరి రేణుక ఎల్లమ్మ నిత్య అన్నదాన సత్రం ద్వారా నిత్యం అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. గౌడ కులస్తులు విరాళ ద్వారా సేవలను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజు గౌడ్, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ గౌడ్, పద్మా గౌడ్, కలర్ సత్తన్న గౌడ్, సలహాదారులు మూలం సంపత్ గౌడ్, డైరెక్టర్లు రవి గౌడ్, బలగం దేవయ్య గౌడ్, నేరెళ్ల నరేష్ గౌడ్, మహిపాల్ గౌడ్, రవి గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love