మాజీ మంత్రి డీఎస్ అంత్యక్రియలు పూర్తి

నవతెలంగాణ-హైదరాబాద్ : సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ బైపాస్ రోడ్ సమీపంలోని ఫామ్‌హౌజ్‌లో పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కాగా నిన్న తెల్లవారుజామున డీఎస్ అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

Spread the love