పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ..

Poor should take advantage of government welfare schemes..– కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ 
నవతెలంగాణ – అచ్చంపేట 
ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే అంబేద్కర్ ప్రజా భవన్ లో  నియోజకవర్గంలోని వివిధ మండలాల గ్రామాలకు చెందిన  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ గ్రామాలకు చెందిన  కళ్యాణ లక్ష్మి,  షాది ముబారక్ 270 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్  137 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో మండలాల తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులు  కార్యకర్తలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Spread the love