బొల్లారంలో ఇసుక రీచ్ ను నిలిపివేయాలని గ్రామస్థుల వినతి..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
ఇసుక రీచ్ తో తమకు ప్రమాదం పొంచి ఉందని వెంటనే ఇసుక తవ్వకాలను ఆపేయాలని తహసిల్దార్ కు వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామస్తులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. బొల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రిచ్ వల్ల గ్రామ చివర్లో ఉన్న ఇళ్లకు, హనుమాన్ ఆలయానికి  ప్రమాదం ఉందని వెంటనే ఇసుక తవ్వకాలను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. సైడ్ వాల్స్ కట్టే వరకు ఇసుక తీసుకుపోవడానికి అనుమతించకూడదని తాసిల్దారు ను కోరారు. గతంలో కూడా చెక్ డ్యామ్ కూలిపోయి పంటలు, ఇల్లు నష్టపోయామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love