నిరుద్యోగులను మోసం చేసిన అధికార పార్టీ

– అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు
నవతెలంగాణ – తాడ్వాయి 
నిరుద్యోగులను మోసం చేసి  100 రోజుల్లో నిరుద్యోగ సమస్యల పరిష్కారిస్తామని చెప్పి వారికీ ఇంతవరకు సమస్యలు పరిష్కరించ లేదని తాడ్వాయి బిజెపి, బీజేవైఎం బిఆర్ఎస్ పార్టీ ల నాయకులు అన్నారు. శుక్రవారం నిరుద్యోగులను మోసగించిన కారణంగా బిఆర్ఎస్,  బిజెవైయం లు రాష్ట్ర శాఖ  టిజిపిఎస్సి ముట్టడి పిలుపును భగ్నం చేయడానికి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేయడం అక్రమమని అన్నారు.ఈ సంధర్భంగా ప్రభుత్వ తీరును భరాస, భారతీయ జనతా యువమోర్చా గిరిజన మోర్చా పక్షాన ఖండిస్తున్నామన్నారు. శుక్రవారం నా లొకేషన్ ట్రేసు చేసి అక్రమంగా పోలీసులు అరెస్ట్ చెయడం అన్యాయం అని అన్నారు. ఉదయం నుండి  పోలీసులు బిఆర్ఎస్, బీజే వైఎం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భర్త పురం నరేష్, జిల్లా నాయకులు డేగల సలేందర్ బూత్ ఇన్చార్జీలు ఆల్ నవీన్, చౌగాని రఘు, బిఆర్ఎస్ నాయకులు రేగ నరసయ్య, మాజీ ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, బంగారు సాంబయ్య, కొర్నేపల్లి శేషగిరి, తిప్పనపల్లి నరేష్, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love