రెండవ రోజు ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు

నవతెలంగాణ –  ముత్తారం
ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు రెండవ రోజు శుక్రవారం ఇంగ్లీష్‌ పరీక్ష జరిగింది. ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంగా 194 మంది విద్యార్థులకు గాను 175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 22 మంది విద్యార్థులకు గాను 18 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 4 గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదు.
Spread the love