నవతెలంగాణ – మోపాల్
జెడ్పీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 4వ తేదీన ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసినట్టు జెడ్పీ ఎన్నికలను కూడా వాయిదా వేస్తారా లేకపోతే ఎన్నికలకు వెళ్తారా అని వేచి చూడాల్సిందే. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పంచాయతీరాజ్ చట్టాలను మాత్రం నిర్వీర్యం చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలు అయినా తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చాలామంది కార్యకర్తలు అప్పటి ప్రతిపక్షంలో సాధకబాదకలను అనుభవించారు రోజురోజుకీ రాజకీయ నిరుద్యోగిత పెరిగిపోతుండడంతో ఆ పార్టీలోనే ఆశావాహులు రోజులను లెక్కించుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందో అని.. కానీ మండల స్థాయిలో చక్రం తిప్పాలన్న మండలాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నా కేవలం ఎంపీపీ జడ్పిటిసి పదవులతోనే సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎంపీపీ మరియు జడ్పిటిసి లకు అరకొర నిధులు మంజూరు చేసి ఆ వ్యవస్థను మాత్రం చాలా నిర్వీర్యం చేసింది.
మరో రకంగా ధనలక్ష్మి కనుకరించాలి.. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కు మాత్రమే క్యాబినెట్ ర్యాంకు తో పాటు మంచి గౌరవ వేతనంతో మంచి అలవెన్స్ లు పొందుతున్నాడు కానీ జెడ్పిటిసిలకు మాత్రం ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనమె సరిగా రావడం లేదు. మండలంలోని తన పరిధిలో నిధులు లేకుండా గ్రామాలకు ఎక్కడ కూడా తమ నిధులను మంజూరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఈక గ్రామాలలో ఎంపీటీసీలకు మాత్రం వార్డు మెంబర్ కు ఉన్న ప్రాధాన్యత కూడా లేదు నిధులు లేవు గౌరవం లేదు ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు ఒక విగ్రహం లాగా ఉంది వారి పరిస్థితి.. గ్రామంలో ఒక బోరు వేయించడానికి కూడా వారి దగ్గర నిధులు లేక ప్రజల ముందు తలదించుకునే పరిస్థితికి దిగజారింది ఎంపీటీసీ వ్యవస్థ.. శిలాఫలకాల పేరుకు మాత్రమే ఈ పదవి ఉంది తప్ప ప్రజల సమస్యలను తీరుస్తామని నమ్మకం లేక లోలోపల కుమిలిపోతున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తే తాము పోటీ చేయాలంటే సిగ్గుగా ఉందని ప్రజల ముందు ఈ ముఖం పెట్టుకొని వారికి ఓట్లు అడగాలని అంతర్మోదనంతో కుమిలిపతున్నారు . రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని సక్రమంగా గుర్తించక రోజుల్లో ఎంపీటీసీ పదవికి గౌరవం లేకుండా పోయింది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వమైన వీరిని గుర్తిస్తుందో లేక పాత ప్రభుత్వంలో లాగే పక్కన పెడుతుందో వేచి చూడాలి మరి…. దేశం యొక్క దశ దిశ మారాలంటే ఈ మూడు అంచల వ్యవస్థ ప్రధాన కీలకం దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలంటే ఈ వ్యవస్థలే అనుసంధాన కర్తగా వ్యవహరిస్తాయి.. అందుకే భారత రాజ్యాంగం కూడా ఇ వ్యవస్థల పైన ఎన్నో చట్టాలు మరియు శాసనాలను చేశాయి.