సూచిక బోర్డు లేక మలుపు రోడ్ వద్ద ఎన్నో ప్రమాదాలు..

– ఉన్నతాధికారులు స్పందించి సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి 
నవతెలంగాణ – మిరుదొడ్డి
మలుపు రోడ్ల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో తరచుగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలం ధర్మారం నుండి మిరుదొడ్డి కి వస్తున్న క్రమంలో సూచిక బోర్డులు లేకపోవడం మూలంగా ఆరేపల్లి గ్రామ శివారులో నేటికీ ఎన్నో తరచుగా ప్రమాదం జరిగితునే ఉన్నాయి. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం నుండి ఆరేపల్లి గ్రామం వైపు వెళ్లే ప్రధాన రోడ్డు మలుపు ఉన్నప్పటికీ అధికారులు సూచిక బోర్డు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో అదే మలుపు రోడ్డు వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగిందన్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు బైక్ పై వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొని తీవ్ర గాయాలకు గురి కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న మలుపు రోడ్ల వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత అధికారుల స్పందించి వెంటనే సూచిక బోర్లు ఏర్పాటు చేయాలి అని ప్రయాణికులు ఆర్ఆర్ బీ అధికారులను కోరుతున్నారు.
Spread the love