గాంధారి సంతలో పప్పు దినుసులకు భలే డిమాండ్

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంతలో విక్రయించే పప్పు దినుసులకు భలే డిమాండ్ ఏర్పడింది. గాంధారి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి నారాయణఖేడ్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పప్పు దినుసులు కొనుగోలు చేస్తున్నారు .వ్యాపారులు బిచ్కుంద బాన్సువాడ పిట్లం తదితర మండలం నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు ఇక్కడ విక్రయించే పప్పు దినుసులు నాణ్యంగా ఉండడంతో డిమాండ్ ఏర్పడిందని వ్యాపారస్తులు కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.
Spread the love