- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య జరిగిన వివాదంపై భారత కెప్టెన్ తిలక్ వర్మ స్పందించారు. 15 ఏళ్ల వైభవ్తో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు నచ్చలేదని, మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు శ్రీలంక ఆటగాళ్లే గొడవకు ప్రయత్నించారని తిలక్ వర్మ అన్నారు. ఇది క్రికెట్కు, భారత్-శ్రీలంక క్రీడా సంబంధాలకు మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



