కందిపప్పుకు నిప్పుపెట్టిన దుండగులు

– లక్షా ఇరవై వేలు ఆస్తి నష్టం
– బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు
నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని చద్మల్ గ్రామంలో చద్మల్ శివారులో గల చాకలి ఈప్ప ప్రాంతంలో గైని తెల్ల సాయులు ఆనే రైతు తాను పడించిన కంది పంటను  కోసి కుప్ప వెయడం జరిగింది. కుప్పను గుర్తు తేలియాని వ్యక్తులు నిప్పు పెట్టారు. రైతు ఉదయం వెళ్లి చూసే వరకు కందికుప్ప మొత్తం బూడిదై ఉంది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. ఎవరో నాకు గిట్టని వాళ్ళు కందికుప్పను అగ్గి పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 13 కింటల కందుల అయ్యేవని రూ.1,20,000 వరకు నష్టం వాటిల్లినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు వేడుకున్నాడు. సంవత్సరం పండించిన పంట డబ్బులు చేతికొచ్చే సమయంలో బూడిద పాలు అయిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Spread the love