సాగర్‌ అప్పగింతపై నేటి భేటీ వాయిదా

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నాగార్జునసాగర్‌ డ్యామ్‌ అప్పగింతపై శుక్రవారం న్యూఢిల్లీల్లో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈమేరకు కేంద్రజలశక్తి శాఖకు గురువారం రాష్ట్ర సాగునీటి శాఖ లేఖ రాసింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. ఇదిలావుండగా శుక్రవారం అసెంబ్లీలో కాళేశ్వరం, ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనున్న నేపథ్యంలోనే సాగు నీటి శాఖ కూడా వాయిదా కోరినట్టు సమాచారం.

Spread the love