నూతన తహసీల్దార్ శ్రీకాంత్ కి సన్మానం

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఎమ్మార్వో తబితా రాణి బదిలీపై అచ్చంపేట ఆర్డీవో కార్యాలయానికి బదిలీ కాగా,  ఆమె స్థానంలో అమ్రాబాద్ మండల ఎమ్మార్వో గా పని చేసిన శ్రీకాంత్ బదిలీపై బుధవారం ఉప్పునుంతల మండల తహసీల్దార్ గా వచ్చి బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోకి రెవెన్యూ కార్యాలయం సిబ్బంది శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ సరస్వతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజాత, జూనియర్ అసిస్టెంట్లు అబ్రహార్,శంకర్, ఆదిత్య, రమణమ్మ, స్వప్న, సిరియాల, ధరణి ఆపరేటర్ ఈశ్వర్, లాలు, శ్రీను, సతీష్, జహీర్ లు పాల్గొన్నారు.
Spread the love