- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హర్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, ఆ ప్రకటనలన్నీ అబద్ధాలేనని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్ను మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. దౌత్యచర్చలు జరుగుతుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్ అంగీకరించదన్నారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరన్నారు. చర్చల్లో కూడా పురోగతి ఉండదని పేర్కొన్నారు.
- Advertisement -



