నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పుట్టిన రోజు వేడుకలని స్నేహితుడి దగ్గర బైక్ తీసుకుని మండి బిర్యానీ తిని బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఇంటికి వస్తుండగా కందికల్ గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై అతి వేగంగా నిర్లక్ష్యంగా కరెంట్ పోల్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో పాతబస్తీ ఛత్రినాక జయప్రకాశ్ నగర్లో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఛత్రినాక జయప్రకాష్నగర్కు చెందిన అమర్సింగ్కు ఇద్దరు సంతానం. కూతురు శిల్ప ఠాకూర్, ఠాకూర్రాధా కిషన్ (24)లు సంతానం, ఠాకూర్ రాధా కిషన్ వృత్తి రీత్యా ఏసీ మెకానిక్. రాధాకిషన్పుట్టిన రోజు ఉందంటూ తన స్నేహితుడు పాతబస్తీ ఛత్రినాక కు చెందిన రోహన్ చౌకట్ వద్ద బైక్ను శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు తీసుకున్నారు. అనంతరం ఆ బైక్పై రాధాకిషన్ఛత్రినాక కు చెందిన జ్ఞానేశ్వర్ఇంగ్లే కుమారుడు వైజనాథ్ఇంగ్లే అలియాస్ సోను (30)తో పాటు శివ పార్వతి నగర్కు చెందిన తిరుపతయ్య కుమారుడు కె.నిఖిల్కుమార్(18) లను తీసుకుని ట్రిపుల్ రైడింగ్చేస్తూ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో మండి బిర్యాని తినడానికి తీసుకెళ్లాడు. భిర్యాని తిన్నాక తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో రాధా కిషన్ బైక్ను నడుపుతుండగా సోను మధ్యలో, వెనుకాల సీటులో నిఖిల్కుమార్ కూర్చున్నాడు. తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో చాంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక కు వస్తున్న క్రమంలో కందికల్ గేట్ ఫ్లైఓవర్బ్రిడ్జి పైన అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతు అదుపుతప్పి మొదట డివైడర్ను తాకుతూ కరెంట్ పోల్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు కిందపడి పోయారు. తలకు బలమైన గాయాలైన రాధాకిషన్ను చికిత్స నిమిత్తం ఎల్బినగర్లోని గ్లెనెగల్స్అవేర్ ఆస్పత్రికి తరలించారు. వైజనాథ్, నిఖిల్లను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్లెనెగల్స్అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధాకిషన్ మృతిచెందగా, వైజనాథ్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.