నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్ లా పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ అవగాహన కార్యక్రమం డాక్టర్. కె. ప్రసన్న రాణి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించగా, ప్రధాన వక్తగా కంక కనకదుర్గ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ మరియు సెషన్ జడ్జ్ నిజామాబాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా.. న్యూ క్రిమినల్ లా ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు.మూడు క్రిమినల్ గ్లాస్ పై సుదీర్ఘ చర్చ నిర్వహించారు.మూడు చట్టాలలో మొదటిది భారతీయ న్యాయ సoహిత ,రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత, మూడవది భారతీయ సాక్ష్య సoహిత మీద విస్తృత సంపూర్ణమైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ శ్రవణ్ కుమార్ అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన క్రిమినల్ లాస్ లో ఉన్న వివిధ కొత్త సెక్షన్లను ఎదురయ్యే సవాళ్ల ను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. బి. స్రవంతి, డాక్టర్. బి. నాగజ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.