- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. వైద్యులు ఆయనకు కరోనరీ యాంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వెల్లడించింది. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో నడ్డా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అస్వస్థతకు కారణాలపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి తెలిపింది.
- Advertisement -



