ఎంపీ చామలను ఘనంగా సన్మానించిన వేమిరెడ్డి

నవతెలంగాణ – మునుగోడు
భువనగిరి ఎంపీ గా రెండు లక్షల మెజార్టీతో గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి హైదరాబాదులోని తమ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృతంలో  మునుగోడు నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎంపీ కృషి ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నా రెడ్డి, వంగాల యాదగిరి రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు తదితరులు ఉన్నారు.
Spread the love