ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో  స్వామివారికల్యాణం ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో ముందుగా ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు రామకృష్ణ చార్యులు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి అధికంగా భక్తులు తరలిరావడంతో ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామివారి కళ్యాణంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love