వీఆర్ఏ కారుణ్య నియామకాలు చేపట్టాలి

నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏ కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ వీఆర్ఏ లు తహశీల్దార్ వీరంగటి మహేందర్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ వీఆర్ఏ సంఘం నాయకులు నీరటి యాకయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కారుణ్య నియామకాలు తో పాటుగా 61 సంవత్సరాల వయస్సు నిండిన వీఆర్ఏ వారసులకు అర్హత ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏ లు చెరుకు వెంకటయ్య, యాకూబ్ పాషా, వెంకటనారాయణ, అంజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love