మహమ్మదాబాద్ ఆభివృద్దికి పూర్తీ స్థాయిలో సహకరుస్తాం

– జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ ఆభివృద్దికి సహకరిస్తానని జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ అన్నారు. శుక్రవారం నాడు గ్రామములో మాజీ సర్పంచ్ లక్షెట్టి సాయులు అద్యక్షతన సిసిరోడు పనులను ప్రారంబించారు. ఈ సంధర్భంగా  ఎమ్మెలే  లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు గ్రామాల ఆభివృద్ది కి కాంగ్రేస్ పార్టీ కట్టుబడి ఉందని అందుకే గ్రామములో రూపాయలు 5 లక్షల వ్యయం తో చాకలి నర్సీంలు ఇంటి నుండి కేనాల్ పెద్ద రోడు వరకు రోడు పనులను స్థానిక కాంగ్రేస్  ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసారు. సిసి రోడు వేయడం వలన గ్రామములోని సమస్యలు దూరం కావడంతో వర్ష కాలం లో బురదలో నడిచే సమస్య ఉండదని , మాజీ సర్పంచ్ సాయులు గ్రామాభివృద్దిలో మంచి పనులు చేయడంతో సంతోషంగా ఉందని పేర్కోన్నారు. సిసి రోడు పనుల ప్రారంబ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కేమ్రాజ్ కల్లాలీ రమేష్ దేశాయి, పెద్ద ఎడ్గి అస్పత్ వార్ వినోద్, పెద్గ గుల్లా విండో డైరెక్టర్ విఠల్ పటేల్ , కాంగ్రేస్ నాయకులు రామన్న, గ్రామస్తులు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love