– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత
నవతెలంగాణ-ఉప్పల్
డివిజన్ను దశల వారీగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేట ర్ బన్నాల గీత అన్నారు. శుక్రవారం డివిజన్లోని ధర్మ పురి కాలనీలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ బన్నాల గీతతో కలిసి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్లోని అన్ని కాలనీల్లో, బస్తీల్లో ప్రజలకు ప్రణాళిక బద్ధంగా దశలవారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తా మన్నారు. ఇందులో భాగంగా ధర్మపురి కాలనీలో సీసీ రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్ గీత మాట్లాడుతూ.. ధర్మపురి కాలనీలోని సాయిబాబా దేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయమని డివిజన్లోని ప్రజలు, ఆలయానికి వచ్చే వారి సౌకర్యార్థం నూతన సీసీ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో చిల్కానగర్ డివిజన్ను ఉప్పల్ నియోజకవర్గంలోనే నంబర్ వన్ డివిజన్గా తీర్చి దిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉద్యమ నాయకులు, మహిళ నాయకురాలు, ధర్మపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులున్నారు.