![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240624-WA0377-253x300.jpg)
– మెచ్చా కు సూచించిన కేసీఆర్…..
నవతెలంగాణ – అశ్వారావుపేట : నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పని చెయ్యాలని,గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజమని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. సోమవారం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఎర్రవెల్లి లోని ఆయన ఫాం హౌస్ లో మెచ్చా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తన హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన అశ్వారావుపేట,దమ్మపేట, ములకలపల్లి సెంట్రల్ లైటింగ్,డిగ్రీ కళాశాల,ఆర్టీఏ సబ్ యూనిట్ కార్యాలయం,కోర్టు,తారు రోడ్లు,హై లెవల్ బ్రిడ్జ్ లు,భవనాలు,సబ్ స్టేషన్ లో మరెన్నో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మొదటి గెలిచే నియోజకవర్గం అశ్వారావుపేట అనుకున్నానని కానీ అమలు కానీ హామీల వల్ల వారి మాయ మాటలు నమ్మి ఇలా జరిగిందని ఆయన అభిప్రాయం పడ్డారు.ఎలాంటి ఇబ్బందీ లేదని రానున్న రోజుల్లో మళ్ళీ తిరిగి తెరాస అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారం.అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే మనం పని చెయ్యాలని,అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పని చెయ్యాలని కెసిఅర్ మెచ్చా కి సూచించారు.