యోగ సాధనతో ఏకాగ్రత సాధ్యం: యార్లగడ్డ అరుణ

నవతెలంగాణ – గోవిందరావుపేట
యోగ సాధన తో మంచి ఆరోగ్యము ఏకాగ్రత సాధ్యమని యోగ మాస్టర్ యార్లగడ్డ అరుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతర యోగ సాధన తో మంచి అవయవ సౌష్టవం, మనసు ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. 108 రకాల యోగాసనాలను ఈ సందర్భంగా నేర్పించడం జరిగిందన్నారు. బిజెపి జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారపుసురేష్ మాట్లాడుతూ యోగా అనేది పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి వరమని అలాగే ఏ పని చేసే వారైనా కనీసం రోజు ఒక గంట ఉదయం యోగా చేస్తే జబ్బులు దరిచేరమని ఈ యొక్క యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కనుక ప్రతి ఒక్కరూ రోజు ఉదయం ఒక గంట పాటు  యోగా చేసి ఆరోగ్యాలను కాపాడుకోవాలని చిన్న పిల్లలకు అలవాటుగా మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మెర పోయిన బిక్షం మహిళా మోర్చాఅధ్యక్షు రాలు అంకిరెడ్డి రమాదేవి పాక సమ్మయ్య అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి మద్దినేని శ్రీనివాస్ అజ్మీరా లలిత బెల్లి లింగయ్య రాజారపు రామచంద్రు జల్లెల రమేష్ ఎడమ మల్లేష్   రవీందర్ రెడ్డి గుగ్గిల సమ్మయ్య కోడి మల్లయ్య తదితరులు యోగా లో పాల్గొని ఆసనాలు వేశారు.
Spread the love