బెంగళూర్‌ దూకుడు

–  ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌
హైదరాబాద్‌ : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో బెంగళూర్‌ టార్పెడోస్‌ దూకుడు చూపించింది. గచ్చిబౌలిలో స్టేడియంలో గురువారం చెన్నై బ్లిట్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్‌ విజయం సాధించింది. 15-, 8-5, 15-10, 15-3తో నాలుగు సెట్లు పూర్తయ్యేలోపే గెలుపు ఖరారు చేసుకుంది. బెంగళూర్‌ ఆటగాళ్లు జోస్‌ ఐబిన్‌, శెట్టి శ్రజన్‌, ముజీబ్‌లు రాణించారు. చెన్నై బ్లిట్జ్‌ సీజన్‌లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.

Spread the love