100 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

–  పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్
నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని నరసింహులపల్లి గ్రామంలో పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నరసింహులపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియా నందు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశామని దాదాపు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం డంప్ ను గుర్తించామని, ఈ బియ్యాన్ని ఎవరు క్లెయిమ్ చేయడం లేదని, పంచనామా నిర్వహించి జిల్లా కలెక్టర్ తదుపరి ఆదేశాల మేరకు ఎం.ఎల్.ఎస్ పాయింట్ వద్ద ఈ బియ్యాన్ని భద్రపరచడం జరుగుతుందని అన్నారుఈ తనిఖీలలో సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు
Spread the love