ముంబయి : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ 19 శాతం వృద్థితో రూ.519 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.436 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.4,047 కోట్లుగా ఉన్న నికర ప్రీమియం.. గడిచిన క్యూ4లో 18 శాతం పెరిగి రూ.4,767 కోట్లకు చేరింది. కాగా.. ప్రతీ ఈక్విటీ షేర్పై తుది డివిడెండ్ కింద రూ.6 చెల్లించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.