30 టన్నుల అక్రమ ఇసుక డంపు స్వాధీనం 

– నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణ శివారులో  ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా డంపు చేసిన ఇసుకను గురువారం  సిద్దిపేట టాస్క్ ఫోర్స్, హుస్నాబాద్  పోలీసులు 30 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.మేడ బోయిన రాజు, కేశవేణి రమేష్ , ఎర్వ శేఖర్, ఎల్కతుర్తి గణేష్ అనే నలుగురి పై కేసు నమోదు చేసినట్లు  టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లి,  నాగారం గ్రామ శివారులో మినీ టిప్పర్స్ నెంబర్ TS02UA-1935, TG02T-1824, లలో పై నిందితులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై  టాస్క్ ఫోర్స్ , హుస్నాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి  అక్రమ రవాణా చేసిన పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667445 ఆఫీసర్స్  8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Spread the love