మంధానాకు 4వ ర్యాంక్‌

మంధానాకు 4వ ర్యాంక్‌– ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. మహిళలజట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృ తి మంధాన 4వ ర్యాంక్‌లో నిలువగా.. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా మహిళలతో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం, ఆ సిరీస్‌లో వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించడంతో వారిద్దరి ర్యాంకులు మెరుగయ్యాయి. మంధాన దక్షిణాఫ్రికాపై 117, 136, 90పరుగులతో రాణించగా.. హర్మన్‌ప్రీత్‌ రెండో వన్డేలో 103పరుగులతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఐసిసి మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మంధాన 738రేటింగ్‌ పాయింట్లతో, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 648రేటింగ్‌ పాయింట్లతో ఆయా స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ బ్యాటర్ల జాబితాలో టాప్‌-10లో చోటు దక్కించుకోవడం విశేషం.

Spread the love