హజ్‌ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి

నవతెలంగాణ – సౌదీ అరేబియా: సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈసారి దాదాపు 550 మంది యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే అందుకు కారణం. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Spread the love