న్యూఢిల్లీ : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)కు రెండు భారీ ఆర్డర్లు దక్కాయి. అదానీ గ్రూప్ నుంచి రూ.7 వేల కోట్ల విలువైన రెండు పవర్ ప్లాంట్ల ఆర్డర్లను దక్కించుకున్నట్లు భెల్ వెల్లడించింది. ఛత్తీస్గఢ్లోని రారుపూర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండు 800 మెగావాట్ల రారుపూర్ సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించిన మొదటి ఆర్డర్ అదానీ పవర్ లిమిటెడ్ నుంచి పొందినట్లు తెలిపింది.ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండు 800 మెగావాట్ల మీర్జాపూర్ సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించి రెండో ఆర్డర్ను అదానీకి చెందిన మరో సంస్థ ఎంటిఇయుపిపిఎల్ నుంచి దక్కించుకున్నట్లు పేర్కొంది. రెండు ప్రాజెక్ట్లకు స్టీమ్ జనరేటర్లు, స్టీమ్ టర్బైన్లు, జనరేటర్లతో సహా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పరికరాలను భెల్ సరఫరా చేయనుంది.