- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. కానీ.. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయబోయే అందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. రాఘోపుర్లో తేజస్వీ యాదవ్పై పోటీకి మరో అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించినట్లు ప్రశాంత్ కిశోర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.. 14న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు.
- Advertisement -