నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్18వ సీజన్లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తు తొలిసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న రాయల్ చాంలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ టీమ్ ప్రధాన పేసర్ హేజిల్వుడ్ గాయపడ్డాడు. ఆర్సీబీ రూ.12.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన హేజిల్వుడ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. గాయం కారణంగానే ఈ నెల 3న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పాల్గొనలేదు. ప్రస్తుతానికి హేజిల్వుడ్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. కానీ తను మిగిలిన లీగ్లో పాల్గొనడం అనుమానంగా మారింది. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయమైంది.
ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ పేసర్ కు గాయం
- Advertisement -
- Advertisement -