- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 నుంచి 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. అటు ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
- Advertisement -



