- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని వాషింగ్టన్లో భార్య సబ్బినేని రజిత (27)ను హత్య చేసిన ఆరోపణలపై అవినాష్ నార్నె (30) అనే తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో రజిత మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది. జూన్ 27న అతడిని ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలతో అరెస్ట్ చేసి, కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల బెయిల్ విధించారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినా, గొంతు నులిమి హత్య చేసినట్లు మెడికల్ ఎగ్జామినర్ నివేదికతో కేసు హత్యగా మారింది.
- Advertisement -



