Thursday, October 16, 2025
E-PAPER
Homeజిల్లాలుమంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం.!

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం.!

- Advertisement -

2025″ కాన్ఫరెన్స్ లో కీలకోపన్యాసం చేసే అవకాశం
నవతెలంగాణ -మల్హర్ రావు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే యాస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025″లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ యాస్ బయోటిక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది.రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు,అవకాశాలు,ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు.

ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్  హిల్లరీ మెక్‌గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు.సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో “గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్” ఆవిష్కరణ హబ్ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.”ఆస్ట్రేలియా-తెలంగాణ” మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. “ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలోవినియోగించుకుంటా కోట్ల పెట్టుబడులను తీసుకొచమరమరిన్రంగంలోవినియోగించుకుంటామన్నారు.ఈ అవకాశాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది” అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -