– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
కల్లుగీత కార్మిక సంఘం 68 సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగిందనీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి ఈ రోజుకు 68 సంవత్సరాలు అవుతుందని, ఈ 68 సంవత్సరాల ప్రయాణం లో ఎన్నో విజయాలు సాధించుకున్నాం అని పేర్కొన్నారు. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయని 1957 లో ధర్మాభిక్షం దాట్ల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం దొరలను భూస్వాములను ఎదిరించి హర్రాజు మామ్లా లను రద్దు చేయించుకుని సొసైటీలను ఏర్పాటు చేసుకొని చెట్టుపై హక్కు ఎక్సగ్రెషియా పెన్షన్ లాంటి అనేక హక్కులను సాధించుకున్నామని, అనేకమంది నాయకులు ధర్మ బిక్షం, ఎస్ ఆర్ దాట్ల మల్లయ్య, తొట్ల మలుసూరు లాంటి అనేకమంది అమరవీరుల స్ఫూర్తితో కల్లు గీత కార్మిక సంఘం దీక్షతో పని చేస్తుందని భవిష్యత్తులోను అదే విధంగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా తెలియజేస్తూ కార్మికుల పక్షాన నికరంగా నిలబడి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. వృత్తి రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తుందని, ఈ పోరాటాల్లో యువత కల్లు గీత కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ప్రభుత్వం వృత్తిలో ఆధునీకరణ చేపట్టి మార్కెట్ సౌకర్యం కల్పిస్తే 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కేరళ రాష్ట్రంలో, ఇజ్రాయిల్ దేశంలో కల్లుగీత వృత్తి మీద ఆధునికరణ చేసి లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుందని కావున కల్లగీత వృత్తిని రక్షించాలంటే మద్యం తగ్గించి స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించే విధంగా అధునికరణ చేపట్టాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు శేర్ల సాయ గౌడ్, డి,నారా గౌడ్, యం, రవీందర్ గౌడ్, కె,మోహన్ గౌడ్, డి రాజా గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కల్లుగీత వృత్తి రక్షణకై ప్రభుత్వం చట్టాలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES