నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని పెద్ద దడ్గీ గ్రామ శివారులో శనివారం రాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతున్న వ్యక్తులు పారిపోయారు. అదే గ్రామానికి చెందిన వడ్ల రవి (22) పంట పొలాల్లోకి పారిపోవడంతో పంట పొలాల్లో బోరు మొటరు విద్యుత్ వైర్ తలిగి అక్కడికక్కడే మృతి చెందారు. రవి రాత్రి ఇంటికి రాక రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం గ్రామ శివారులో వెతకగా పంట పొలాల్లో విద్యుత్ షాక్ తో మృతి చెంది ఉన్నాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి యవకులను వెంబడించడం వల్లనే వడ్ల రవి పంటపొలాల్లోకీ పారిపోయి విద్యాత్ షాక్ కు గురై చనిపోయినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై ఏసై మోహన్ రెడ్డి ని వివరణ కోరగా రవి కాలకృత్యాలకు వెళ్లి పంట పొలాల్లో జారిపడి విద్యుత్ వైర్ పై పడడంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు ఆయన తెలిపారు
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES