Thursday, June 25, 2026
E-PAPER
Homeక్రైమ్కోల్‌కతాలో కూలిన గోడౌన్

కోల్‌కతాలో కూలిన గోడౌన్

- Advertisement -

నలుగురు మృతి
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : సీపీఐ(ఎం)

కోల్‌కతా : కోల్‌కతాలోని తారతలా ప్రాంతంలో బుధవారం నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ షెడ్ కూలిపోవడంతో కనీసం నలుగురు కార్మికులు చనిపోగా, 21 మందిని రక్షించారు. మరో 12 నుంచి 18 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. “ఎన్డీఆర్ ,ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ , పోలీసులు , అగ్నిమాపక శాఖ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. తారతలాలోని బీ/2 ట్రాన్స్‌పోర్ట్ డిపో రోడ్‌లో ఉన్న ఒక ప్రయివేట్ గోడౌన్ నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది, శ్యామా ప్రసాద్ ముఖర్జీ (ఎస్ఎంపీ) పోర్ట్ అథారిటీ సంఘటనా స్థలంలో అనేక అత్యవసర చర్యలను వెంటనే చేపట్టినట్లు తెలిపింది.అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని, పదేపదే ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేదని సీపీఐ(ఎం) నాయకుడు ఫయాజ్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు.
“అనేక ప్రాణాలు పోయాయి; కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ బాధ్యత వహించాల్సిందే. స్థానిక యంత్రాంగం కూడా బాధ్యత వహించాలి, ఎందుకంటే ఇక్కడి నివాసితులు ఈ ప్రాంగణం గురించి పోర్ట్ ట్రస్ట్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. ఇక్కడ అక్రమ పనులు జరుగుతున్నాయని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ప్రతి విషయాన్ని కేవలం ఒక ఆటగా—డబ్బు కోసం ఆడే ఆటగా—భావించి చూసీచూడనట్టు వ్యవహరిస్తే, చివరికి అమాయక ప్రజలు, కూలీలు స పేదలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు,” అని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -