- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ సమేత పద్మావతి వెంకటేశ్వర స్వామి( కుక్కల గుట్ట) విగ్రహాల పున ప్రతిష్ట కార్యక్రమాల పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించినారు. వచ్చేనెల 5వ తేదీ నుండి కార్యక్రమాలు ప్రారంభమై ఏడవ తేదీ అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ,మాజీ కౌన్సిలర్ పాలెపు రాజు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



