- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో అతను సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్నాడు. వైద్య నివేదికల ప్రకారం అతడు 5 నుండి 7 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాలని సమాచారం.
- Advertisement -



