Thursday, October 30, 2025
E-PAPER
Homeఆటలుమ‌రోసారి మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం

మ‌రోసారి మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్ కు మ‌రోసారి వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. మ్యాచ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే వ‌ర్షం ప‌డింది. దీంతో 18 ఓవ‌ర్ల‌కు మ్యాచ్‌ను కుదించారు. ఆ త‌ర్వాత తొమ్మిది ఓవ‌ర్లు ముగిసేరికి మ‌రోసారి వ‌ర్షం కురిసింది. దీంతో తాత్కాలికంగా ఆట‌కు బ్రేక్ ప‌డింది.

అయితే భార‌త ఓపెన‌ర్లు గిల్, అభిషేక్ తొలి వికెట్‌కు 35 ర‌న్స్ జోడించారు. నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. అయితే 9 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి భార‌త్ 97 ర‌న్స్ చేసింది. గిల్ (37), సూర్య (39) ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -