Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే 

రైతులకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
లోయ జూరాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం  అందజేశారు. 25 మందికి  రూ1,36,13,756  నష్టపరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు చెక్కులను మంజూరు అయ్యాయి. అందుకు 11 మంది లబ్ధిదారులకు  17 చెక్కులు రూ87,63,118  చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే  అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కృష్ణమ్మ వరదలతో ముంపుకు గురైన రేకులపల్లి గ్రామం సమీపంలోని జెన్కో దగ్గర 67 ఎకరాల వరకు రైతులు తమ భూములను కోల్పోవడం జరిగింది దాదాపుగా 46 మంది రైతులు తమ భూములను త్యాగం చేసి జెన్కో లో విద్యుత్ ఉత్పత్తికి సహకరించినందుకే నేడు ప్రజలకు నాణ్య మైన కరెంటు సరఫరా కావడం జరుగుతుందని పేర్కొన్నారు. 

  రైతులు భూమిని ఎంతో పెద్ద మనసుతో ఆనాడు భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కావున జెన్కో అధికారులతో పలుమార్లు కలిసి మాట్లాడి భూమిని కోల్పోయిన రైతులను ఆదుకోవాలని వారికి ఏదో రూపంలో ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందించాలని కోరడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతుకు ప్రతి ఎకరానికి  ఏడు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. రూ.7 లక్షలు కూడా తక్కువని ప్రస్తుత భూమి విలువ ధర .30, రూ.40 లక్షల విక్రయం అవుతుంది. మీ త్యాగం ఎన్నటికీ ఎప్పటికీ మరువలేనని కొనియాడారు. 

నేడు మూడో విడతలో భాగంలో రేకులపల్లి గ్రామానికి చెందిన   ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిదంగా మిగిలిన రైతులకు త్వరలోనే వస్తాయని తెలిపారు. మీ త్యాగం వల్లనే నేడు విద్యుత్, సాగునీటి సరఫరా అవుతుందని కావున గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలని రైతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, నాయకులు హనుమంతు రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి,  అధికారులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -